దివ్యాంగులపై స్మితా కామెంట్స్ సరికాదు : హరీశ్రావు
పంటల రుణమాఫీకి రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధన అమలు చేస్తున్నారు.. ఈ నిబంధనల వల్ల చాలా మంది రైతులకు రుణమాఫీ కావట్లేదు అని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
- By VamshiLoading...
- | 22 July 2024 10:52 AM GMT
X
దివ్యాంగులపై సీనియర్ ఐఏఎస్ అధికారణి స్మితా సబర్వాల్ చేసిన కామెంట్స్ సరికాదని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. పంటల రుణమాఫీకి రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధన అమలు చేస్తున్నారు.. ఈ నిబంధనల వల్ల చాలా మంది రైతులకు రుణమాఫీ కావట్లేదు అని హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీలో కోతలు పెట్టేందుకే రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తున్నారు అని మండిపడ్డారు. ప్రత్యేక విభాగాల వైద్యులను జిల్లాలకు బదిలీ చేశారు. అనుభవం ఉన్న వైద్యులను చిన్న ఆస్పత్రులకు బదిలీ చేశారు.
ప్రస్తుత విభాగాల్లోనే సూపర్ స్పెషాలిటీ నిపుణులను కొనసాగించాలి. ఉద్యోగులకు డీఏలు ఇస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేరలేదు. ప్రతిపక్షం ఇస్తున్న సూచనలను ప్రభుత్వం పాటించాలి. దివ్యాంగులపై స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను సమర్థించను అని హరీశ్రావు స్పష్టం చేశారు. వృద్ధ్యాప్య పెన్షన్లు సమయానికి రావడం లేదు. సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నిరుద్యోగులపై లాఠీలు ఝులిపిస్తున్నారు. పోలీసు శాఖలో డీజిల్ డబ్బులు ఇవ్వడం లేదు. హోంగార్డులకు జీతాల్లేవు. కల్యాణలక్ష్మి పథకం ఆగిపోయింది. లక్ష మందికి పైగా చెక్కుల కోసం ఎదురుచూస్తున్నారు. రైతుబీమా చెక్కులకు కనీసం నెల సమయం పడుతోంది అని హరీశ్రావు తెలిపారు.