సిరాజ్కు జూబ్లీహిల్స్లో ఇంటి స్థలం
భారత స్టార్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్కు తెలంగాణ సర్కార్ ఇంటి స్థలం కేటాయించింది.
- By VamshiLoading...
- | 9 Aug 2024 1:01 PM GMT
X
X
భారత స్టార్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్కు తెలంగాణ సర్కార్ ఇంటి స్థలం కేటాయించింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో 600 గజాల స్థలాన్ని కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇటీవల జరిగిన శాసన సభ సమావేశాల్లో సిరాజ్కు ఇంటి స్థలంతో పాటు గ్రూప్-1 ఉద్యోగం కూడా ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయించారు.
టీ20 వరల్డ్కప్ గెలిచిన టీమిండియా జట్టులో సభ్యుడైన మహ్మద్ సిరాజ్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకొన్నాడు. ఈ సందర్భంగా సిరాజ్ను సన్మానించిన సీఎం.. ఆటగాడిగా దేశానికి, రాష్ట్రానికి గొప్ప పేరుప్రఖ్యాతులు తీసుకువచ్చావని ప్రశంసించిన సంగతి తెలిసిందే.
Vamshi
Writer
Next Story