హైడ్రా కమిషనర్పై సీపీఐ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
హైడ్రా కమిషనర్ రంగనాథ్పై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగనాథ్ అత్యుత్సాహం చేస్తున్నారని దీంతో ఆయన ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయన్నారు.
- By VamshiLoading...
- | 28 Aug 2024 8:58 AM GMT
X
హైడ్రా కమిషనర్ రంగనాథ్పై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగనాథ్ అత్యుత్సాహం చేస్తున్నారని దీంతో ఆయన ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయన్నారు. పేద ప్రజల ఇళ్లు కూలుస్తున్నారు. బడాబాబుల జోలికి వెళ్లడం లేదన్నారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ను రాజకీయం చేయొద్దని పేర్కొన్నారు. ఆమెపై అంత కక్ష ఎందుకని ప్రశ్నించారు. కవిత జైలు నుండి విడుదలపై కాంగ్రెస్, బీజేపీ రాజకీయం సరికాదన్నారు.
హైదరాబాద్లో అక్రమ కట్టడాలపై దూకుడుగా వ్యవహరిస్తున్న హైడ్రా తెలంగాణ రాష్ట్రానికి అవసరం అని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో హైడ్రా అంటే ఒక భయానకమైన పేరు అని.. దాని పేరు వింటేనే పలురువు భయపడిపోతున్నారని.. అలాంటి పేరుతో ప్రభుత్వం రంగంలోకి దిగిందని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఈ హైడ్రాను నిర్ధిష్టమైన ప్రణాళికతో ఉపయోగించకపోతే.. నిజంగానే డ్రాగన్ అవుతుందని కూనంనేని అన్నారు.