అచ్యుతాపురం మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం

అచ్యుతాపురం సెజ్‌ ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల కుటుంబీకులతో విశాఖ జిల్లా కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ మాట్లాడారు. రూ.కోటి చొప్పున పరిహారం కలెక్టర్‌ ప్రకటించారు.

Acthapuram
X

అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు విశాఖ జిల్లా కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి కూడా పరిహారం ఇస్తామని కలెక్టర్‌ వారికి హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. ఈ ప్రమాదంలో 18 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.

మొదటి అంతస్తు శ్లాబు కింద పడి ఏడుగురు మృతి చెందారు. గాయపడినవారిలో ఐదుగురు 60 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్నట్టు సమాచారం. ప్రమాద సమయంలో పరిశ్రమలో దాదాపు 300 మంది కార్మికులు ఉ న్నట్టు సమాచారం. పేలుడు ధాటికి పరిశ్రమమొదటి అంతస్తు స్లాబు కూలిపోయింది. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

Vamshi

Vamshi

Writer
    Next Story