రేవంత్ రెడ్డి పనిలో పడి తిండి తినట్లేదు : మల్లు రవి
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రోజుకు 20 గంటలు పని చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. పనిలో పడి రోజు ఉదయం టిఫిన్ చేయట్లేదు.. మధ్యాహ్న చేయాల్సిన భోజనం కూడా సాయంత్రం 5 గంటలకు చేస్తున్నారు - కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి
- By VamshiLoading...
- | 19 Jun 2024 9:55 AM GMT
X
X
సీఎం రేవంత్రెడ్డి ఆరు గ్యారెంటీల అమలు కోసం రోజుకు 20 గంటలు పని చేస్తున్నారని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం పనిలో పడి తిండి కుడా తినట్లలేదన్నారు. ఉదయం టిఫిన్ చేయకుండా మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం చేస్తున్నారని ఆయన అన్నారు.
లంచ్ కుడా సాయంత్రం ఐదు గంటలకు చేస్తున్నారని మల్లు రవి అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భోజనం చేయకుండా పనిచేస్తురని ఆయన అన్నారు. ఆగస్టు 15 తేదిలోగ రైతుల రుణ మాఫీ చేస్తామని ఆయన అన్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కూలిపోతుందన్నారు. రాబోయే కాలంలో ఇండియా కూటమి అధికారంలో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Vamshi
Writer
Next Story