విజయవాడ-హైదరాబాద్‌ మధ్య రైలు సర్వీసుల పునరుద్ధరణ

ట్రయల్‌ రన్‌లో భాగంగా విజయవాడ నుంచి గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ మొదట పంపిన అధికారులు

విజయవాడ-హైదరాబాద్‌ మధ్య రైలు సర్వీసుల పునరుద్ధరణ
X

విజయవాడ-హైదరాబాద్‌ మధ్య రైలు సర్వీసులను పునరుద్ధరించారు. వరంగల్‌ మీదుగా హైదరాబాద్‌ వెళ్లే రైళ్లను పంపుతున్నారు. ట్రయల్‌ రన్‌లో భాగంగా అధికారులు విజయవాడ నుంచి గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ మొదట పంపారు. గుంటూరు, విజయవాడ, వరంగల్‌ మీదుగా హైదరాబాద్‌కు గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వెళ్లనున్నది.

భారీ వర్షాలు, వరదలకు ఇంటికన్నె-కేసముద్రం రైల్వే ట్రాక్‌ శనివారం కొట్టుకుపోయింది. దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి ట్రాక్ ను పునరుద్ధరించింది. రైల్వే సిబ్బంది గూడ్స్ రైలుతో ట్రయల్ రన్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో విజయవాడ- హైదరాబాద్‌ మధ్య రైలు సర్వీస్‌లను పునరుద్ధరించింది.

Raju

Raju

Writer
    Next Story