ఏపీ హైకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట

ఏపీ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట లభించింది.

ఏపీ హైకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట
X

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభలేని వంశీకి ఊరట లభించింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయన ముందుస్తు బెయిల్ విచారణలో అనుకూలంగా తీర్పు లభించింది.ఈ నెల 20 వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశం ఇచ్చింది. కోర్టు తీర్పుతో వల్లభనేని వంశీకి ఊరట దక్కింది.

అలాగే ఈ పిటిషన్ పై తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది న్యాయస్థానం. కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని 71వ ముద్దాయిగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్టు చేశారు. దాడిలో వంశీ నేరుగా పాల్గొనకపోయినా. ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రోద్బలంతోనే వైసీపీ నాయకులు విధ్వంసం సృష్టించాయనే ఆరోపణలున్నాయి.

Vamshi

Vamshi

Writer
    Next Story