రాణించిన పరాగ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డేలో భారత బౌలర్లు లంకను కట్టడి చేశారు.
- By VamshiLoading...
- | 7 Aug 2024 12:38 PM GMT
X
X
భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డేలో భారత బౌలర్లు లంకను కట్టడి చేశారు. అరంగేట్ర కుర్రాడు రియాన్ పరాగ్(3/54) రాణించగా ఆతిథ్య జట్టు 248 పరుగులు చేసింది. కొలంబోలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో(94), పథుమ్ నిశాంక(45)లు లంకు శుభారంభమిచ్చినా మిడిలార్డర్ చేతులెత్తేసింది. ఆఖర్లో కుశాల్ మెండిస్(59), కమింద్ మెండిస్(23 నాటౌట్)లు ధనాధన్ ఆడారు. దాంతో, శ్రీలంక పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది. టీమిండియా లక్ష్యం 249 పరుగులు.
Vamshi
Writer
Next Story