తెలంగాణాకు మూడు రోజులు రెయిన్ అలర్ట్
పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక
- By Naveen KameraLoading...
- | 7 Sept 2024 11:57 AM GMT
X
X
వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం మూడు రోజుల పాటు రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఆదివారం కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అతి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. 9వ తేదీన కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించారు. 10వ తేదీన కామారెడ్డి మినహా మిగతా అన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోందని ఐఎండీ, దాని ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Naveen Kamera
Writer
Next Story