త్వరలో భారత్‌ డోజో యాత్ర..ఎక్స్ వేదికగా రాహుల్ ప్రకటన

త్వరలో భారత్ డోజో యాత్ర రాబోతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేక వీడియోను షేర్ చేస్తూ కీలక ప్రకటన చేశారు.

Rahul gandhi
X

త్వరలో భారత్ డోజో యాత్ర రాబోతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేక వీడియోను షేర్ చేస్తూ కీలక ప్రకటన చేశారు. నేడు జాతీయ క్రీడా దినోత్సవం ఈ సందర్భంగా గతంలో జోడో యాత్ర’ సమయంలో తమ శిబిరాల వద్ద జరిగిన జియు-జిట్సు ప్రాక్టీస్‌ సెషన్‌కు సంబంధించిన వీడియోను ట్వీట్టర్ వేదికగా రాహుల్ పంచుకున్నారు.

ఫిట్‌గా ఉండేందుకు ప్రతి రోజూ జియు-జిట్సు ఆర్ట్స్‌ను ప్రాక్టీస్‌ చేసేవాళ్లు. జియు-జిట్సు అనేది బ్రెజిల్ మార్షల్ ఆర్ట్. జోడో యాత్రలో రోజూ సాయంత్రం శిబిరంలో మార్షల్ ఆర్ట్ జియు-జిట్సు సాధన చేసేవారు. నేడు స్పోర్ట్స్‌ డే సందర్భంగా ఆ అనుభవాలను తాజాగా వీడియో రూపంలో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతోంది. ఇక ఇదే ట్వీట్‌లో త్వరలో ‘భారత్‌ డోజో యాత్ర’ రాబోతోందంటూ రాహుల్‌ ప్రకటించారు. ‘డోజో’ అంటే మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణనిచ్చే కేంద్రాలను డోజో అని పిలుస్తారు.

Vamshi

Vamshi

Writer
    Next Story