రాహుల్ జీ.. అశోక్నగర్కు వచ్చి మీ హామీని ఎలా నిలబెట్టుకుంటారో చెప్పండి:కేటీఆర్
ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని అని నమ్మించి తెలంగాణ యువతను మోసం చేస్తున్న విధానంపై అవసరమైతే ఢిల్లీకి వచ్చి రాహుల్గాంధీని ఎండగడుతం అని కేటీఆర్ హెచ్చరించారు.
- By RajuLoading...
- | 3 Aug 2024 6:30 AM GMT
X
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తుందన్న మీ మాటలు నమ్మి తెలంగాణ యువత కాంగ్రెస్పార్టీకి ఓటు వేసింది. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయినా ఇప్పటివరకు ఇచ్చిన ఉద్యోగాలు సున్నా అని, ఎన్ని ఉద్యోగాలు ఇస్తామో అన్నది చెప్పకుండా జాబ్లెస్ క్యాలెండర్ను ప్రకటించారని మండిపడ్డారు. మరోసారి హైదరాబాద్లోని అశోక్నగర్కు ఎందుకు రావడం లేదు? మీరు ఎన్నికలకు ముందు కలిసిన నిరుద్యోగ యువతను కలిసి మీ హామీని ఎలా నిలబెట్టుకుంటారో చెప్పండి? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్గాంధీ అశోక్నగర్లో నిరుద్యోగులతో మాట్లాడిన వీడియోను షేర్చేశారు.
ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని అని నమ్మించి తెలంగాణ యువతను మోసం చేస్తున్న విధానంపై అవసరమైతే ఢిల్లీకి వచ్చి రాహుల్గాంధీని ఎండగడుతం అని కేటీఆర్ హెచ్చరించారు.పోరాటం మాకు కొత్త కాదని మిమ్మల్ని వదిలిపెట్టం, మీరు బూతులు తిట్టినా, అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటామని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.