తెలుగు రాష్ట్రాల్లో వరదలపై స్పందించిన రాహుల్ గాంధీ
తెలుగు రాష్ట్రాల్లో వరదలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వరదల వల్ల ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- By VamshiLoading...
- | 2 Sept 2024 9:05 AM GMT
X
X
తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తు వర్షాలు, వరదలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.
భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రస్తుత పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, పునర్నిర్మాణ ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని తెలిపారు. ప్రకృతి విపత్తు కారణంగా నష్టపోయిన వారందరికీ సమగ్ర పునరావాస ప్యాకేజీని సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Vamshi
Writer
Next Story