మణిపూర్ను సందర్శించాలని ప్రధానికి రాహుల్ విజ్ఞప్తి
మణిపూర్ను సందర్శించాలని ప్రధాని నరేంద్రమోడీకి విపక్ష నేత రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు.
- By RajuLoading...
- | 15 Aug 2024 2:03 PM GMT
X
మణిపూర్ను సందర్శించాలని ప్రధాని నరేంద్రమోడీకి విపక్ష నేత రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో నివసిస్తున్న మణిపూర్ ప్రజలతో భేటీ అయినట్టు ఎక్స్ వేదికగా వెల్లడించారు. భద్రత విషయంలో ఆందోళన, ప్రతీకారం తీర్చుకుంటారనే భయంతో.. తమ ముఖాలను చూపించవద్దని వారు విజ్ఞప్తి చేసినట్టు రాహుల్ పేర్కొన్నారు. మణిపూర్లో పర్యటించి, శాంతియుత పరిష్కారానికి ప్రధాని కృషి చేయాలని మరోసారి కోరుతున్నాను అని రాహుల్ ఎక్స్లో ట్వీట్ చేశారు.
గత ఏడాది జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికి మణిపూర్లో ఇప్పటికీ పూర్తిస్థాయిలో శాంతి నెలకొనలేదు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ స్పందిస్తూ...మనం స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు.. నిజమైన స్వేచ్ఛ దొరకని మణిపూర్ దుస్థితి గురించి మనం ఆలోచిద్దాం. మణిపూర్లో మరోసారి పర్యటించి శాంతియుత పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని నేను మరోసారి ప్రధానిని కోరుతున్నాను అని రాసుకొచ్చారు.