పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ ఖరారు
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబర్ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించనున్నారు.
- By VamshiLoading...
- | 21 Aug 2024 12:13 PM GMT
X
X
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబర్ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించనున్నారు. ఓటరు జాబితాపై సెప్టెంబర్ 7 నుంచి 13వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి సెప్టెంబర్ 21న వార్డుల వారీగా తుది ఓటరు జాబితా ప్రచురణ ఉంటుందని ఎన్నికల కమీషన్ పేర్కొంది. సెప్టెంబర్ 9,10వ తేదీలలో రాజకీయపార్టీల సూచనలు స్వీకరిస్తామని, ఓటరు జాబితా తయారీపై ఈనెల 29న జిల్లా కలెక్టర్లతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమీషర్ పార్థసారథి తెలిపారు
Vamshi
Writer
Next Story