గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది

APPSC
X

ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష పడింది. పలు కారణాల వల్ల జూలై 28న జరగాల్సి గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వేసినట్లు కమిషన్ తెలియజేసింది. సిలబస్‌లో మార్పులు చేయడం, ఎన్నికల ప్రక్రియ వల్ల పూర్తి స్థాయిలో పరీక్షకు సన్నద్ధం కాలేకపోయామంటూ ఎగ్జామ్‌ను మరికొంత సమయం పెంచాలంటూ అభ్యర్థులు ఆందోళనలు చేశారు.అభ్యర్థుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకోవాలంటూ పలువురు ప్రజా ప్రతినిధులు సైతం విజ్ఞప్తి చేశారు. ఈ విన్నపాలపై తాజాగా ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ నెల(జులై) 28వ తేదీన జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. కొత్త తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రకటన జారీ చేసింది

Vamshi

Vamshi

Writer
    Next Story