బాపట్లలో విష వాయువు లీక్ 30 మంది విద్యార్థులు అస్వస్థత

బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో సైన్స్ ల్యాబ్‌లో కెమికల్ పౌడర్ కారణంగా 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

Bapatla
X

బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో సైన్స్ ల్యాబ్‌లో కెమికల్ పౌడర్ కారణంగా 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ల్యాబ్‌లో అనుకోకుండా ప్రమాదకర విష వాయువులు విడుదలయ్యాయి. దీంతో ల్యాబ్‌లో ఉన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఊపిరి ఆడకపోవడంతో పలువురు ల్యాబ్‌ నుంచి బయటకు పరిగెత్తారు. మరికొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో ఉపాధ్యాయులు వారిని బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ సంఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Vamshi

Vamshi

Writer
    Next Story