గేమి తుపాన్తో ఫిలిప్పీన్ అతలాకుతలం
ఫిలిప్పీన్స్ను గేమీ తుపాను అతలాకుతలం చేస్తున్నది. వరదల కారణంగా ఇప్పటివరకు 34 మంది మృతి చెందారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు.
- By RajuLoading...
- | 28 July 2024 8:26 AM GMT
X
X
ఫిలిప్పీన్స్ను గేమీ తుపాను అతలాకుతలం చేస్తున్నది. భారీ వర్షాలతో పలు ప్రాంతాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 34 మంది మృతి చెందారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. 30 లక్షల మందికి పైగా వరద ప్రభావానికి గురయ్యారు. వందల సంఖ్యలో ఇండ్లు ధ్వంసమయ్యాయి.
పలు చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో లక్షల మంది అంధకారంలో ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో నాలుగు అడుగుల మేర వరద నీరు నిలిచింది. వరదల్లో చిక్కుకున్న వారిని సహాయ బృందాలు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాయి. వరద బాధితులకు ఆహారం, మందులు, ఇతర సామాగ్రి అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Raju
Writer
Next Story