అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా పెమ ఖండూ ప్రమాణ స్వీకారం

సీఎంగా ఖండూ మూడోసారి బాధ్యతలు

Arunachal pradesh
X

అరుణాచల్ ప్రదేశ్‌లో మరోసారి బీజేపీ సర్కార్ కొలువుదీరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెమా ఖండూ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కేటీ పర్నాయక్ ఈ రోజు ఖండూ చేత ప్రమాణం చేయించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 46 స్థానాల్లో విజయం సాధించింది. నేనషల్​పీపుల్స్​పార్టీ(ఎన్​పీఈపీ) ఐదు స్థానాల్లో గెలుపొందింది. ఎన్​సీపీ మూడు, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) రెండు, కాంగ్రెస్ ఒక స్థానంలో, స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి.

మొత్తం 60 స్థానాల్లో ఎన్నికలకు ముందే 10 స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. వారిలో అరుణాచల్​ప్రదేశ్​సీఎం పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్ ఉన్నారు. మరోవైపు, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తన రెండు స్థానాలను రాష్ట్రం నుంచి నిలబెట్టుకుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ హాజరయ్యారు.

Vamshi

Vamshi

Writer
    Next Story