సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్

వరద బాధితులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోటి రూపాయల చెక్కును విజయవాడ కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబు నాయుడుకు అందించారు.

Pavan
X

వరద బాధితులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోటి రూపాయల చెక్కును విజయవాడ కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబు నాయుడుకు అందించారు. ఇక వరద బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధికి సాయం చేస్తాన్నని పవన్ చెప్పిన సంగతి తెలిసిందే. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వినాయకుని పూజల్లో పాల్గొన్నారు.

సీఎం చంద్రబాబుతో భేటీ అయిన డిప్యూటీ సీఎం పవన్..వరదలపై చర్చించారు. అటు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పై చంద్రబాబు ఆరా తీశారు. విశ్రాంతి తీసుకోమ్మని సీఎం సూచించారు. కాగా తెలంగాణకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు పవన్. పంచాయితీల అభివృద్ధికి మరో రూ.4 కోట్లను ఆయన ప్రకటించిన విషయం విదితమే.

Vamshi

Vamshi

Writer
    Next Story