ఆడపడుచులకు పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక కానుక

పిఠాపురంలోని పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. పవన్‌ సొంత ఖర్చుతో ప్రత్యేక కానుకగా 12 వేల చీరలు, పసుపు, కుంకమలు అందించారు.

ఆడపడుచులకు పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక కానుక
X

శ్రావణమాసం చివరి శుక్రవారం కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. ఈ పూజల్లో పాల్గొనే భక్తులకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సొంతఖర్చుతో ప్రత్యేక కానుకగా 12 వేల చీరలు అందజేశారు. పవన్‌ తరఫున ఆయన వదిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సతీమణి పద్మజ, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్‌, వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు.

పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచులకు పవన్‌ కల్యాణ్‌ పసుపు కుంకుమ కానుక అంటూ ప్రత్యేకంగా తయారు చేసిన సంచుల్లో చీర, పసుపు, కుంకుమలను అందజేశారు. పద్మజ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ బొట్టుపెట్టి మరీ సారె అందజేశారు.

Raju

Raju

Writer
    Next Story