ఒలింపిక్స్ : 50మీ రైఫిల్ 3పీ ఈవెంట్లో.. ఫైనల్ చేరిన స్వప్నిల్ కుశల్
షూటర్ స్వప్నిల్ కుశల్.. 50మీ రైఫిల్ 3పీ ఫైనల్లోకి వెళ్లాడు. క్వాలిఫికేషన్ రౌండ్లో అతనికి 590 పాయింట్లు వచ్చాయి. ఏడవ స్థానంలో ఆ షూటర్ నిలిచాడు.
- By VamshiLoading...
- | 31 July 2024 9:35 AM GMT
X
X
పారిస్ వేదిక జరుగుతున్న ఒలింపిక్స్లో మరో భారత్ ఆటగాడు పతకానికి చేరువయ్యాడు. 50 మీటర్ల రైపిల్ 3పి పొజిషన్స్ ఈవేంట్లో స్వప్నిల్ కుశలే ఫైనల్కు చేరాడు. 590 పాయింట్లతో ఏడు స్థానంలో నిలిచారు. కాగా రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ఫైనల్ జరగనుంది. దీంతో భారత జట్టుకు మరో మెడల్ వచ్చే అవకాశం ఉంది.
బుధవారం జరిగిన మ్యాచులో కుసాలే తన 60 షాట్లను 590 పాయింట్లతో 38 ఇన్నర్ 10లతో ముగించాడు. దీంతొ టాప్ ఎనిమిది షూటర్లలో చోటు సంపాదించుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్లో బుధవారం జరిగిన పురుషుల రైఫిల్ 50 మీటర్ల 3-పొజిషన్స్ ఫైనల్లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే క్వాలిఫికేషన్ రౌండ్లో ఏడో స్థానం సాధించి ఫైనల్లోకి ప్రవేశించాడు. కాగా 3 పొజిషన్ షూటింగ్ అంటే పడుకొని, మోకాళ్లపై కుర్చొని, నిలబడి షూట్ చేయడం.
Vamshi
Writer
Next Story