రాష్ట్రంలో ప్రజా పాలన కాదు.. ప్రతీకార పాలన: ఆర్‌ఎస్‌పీ

తొమ్మిది నెలల రేవంత్‌ ప్రభుత్వ తీరుపై ఆర్‌ఎస్‌పీ ఫైర్‌

రాష్ట్రంలో ప్రజా పాలన కాదు.. ప్రతీకార పాలన: ఆర్‌ఎస్‌పీ
X

కాంగ్రెస్ పాలన ప్రజా పాలన కాదు రాష్ట్రం లో ప్రతీకార పాలన సాగుతున్నదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ మాట్లాడుతూ.. రేవంత్‌ ప్రభుత్వ తీరుపై ఆర్‌ఎస్‌పీ ఫైర్‌ అయ్యారు.9 నెలలుగా తెలంగాణలో విద్యాశాఖకు మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రి గా వున్నా సీఎం ఎప్పుడైనా సమీక్షా చేశారా అని ప్రశ్నించారు. విద్యా శాఖ పైన ముఖ్యమంత్రికి కనీస అవగాహన లేదు.ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నది. విద్యార్థులకు యూనిఫామ్స్ లేవు , చలికాలం వస్తున్నది ఉలన్ రగ్గులు లేవు , బూట్లు ఇవ్వలేదని దుయ్యబట్టారు. కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు ఫీజులు కట్టడంలేదని మెమోలు ఇవ్వడం లేదన్నారు. ఈ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవడం తో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.

కేసీఆర్ ప్రభుత్వ గురుకులాల్లో పేద విద్యార్థులు ఎంబీబీస్ ,ఐఐటీ లు సాధించాలని సెంటర్ ఆఫ్ ఎక్ససెలెన్సు ఏర్పాటు చేశారు.ఇపుడు వాటిని ఎత్తి వేసే కుట్ర జరుగుతున్నది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గెస్ట్ ఫాకల్టీ కి నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు.వాళ్ళు ఉద్యోగాలు మానేసేలా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తారు. పేద విద్యార్థులంటే ఎందుకు కోపం రేవంత్ రెడ్డీ అని ప్రశ్నించిన ఆర్‌ఎస్‌పీ వెంటనే గురుకుల కాలేజీల గెస్ట్ ఫాకల్టీ కి, స్పోర్ట్స్ స్కూళ్ల లో కూడా అధ్యాపకుల జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విద్యా భరోసా కింద ఒక్కో విద్యార్థికి 5 లక్షలు ఇస్తామన్నారు ఒక్క పైసా అయినా విడుదల చేశారా అని నిలదీశారు.

కేసీఆర్‌ గురుకుల విద్యాలయాలు 250 నుండి 1000 వరకు పెంచారు. దేశంలో రోల్ మోడల్ గా గురుకులాలను తీర్చిదిద్దారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గురుకులాలను విస్మరిస్తోంది. గురుకులాల్లో అన్ని వర్గాల విద్యార్థులు విద్యను పొందుతున్నారు. అక్షయ పాత్త్ర సంస్థను విద్యాలయాలకు అంటకట్టడం సరికాదన్నారు. ధార్మిక సంస్థల భోజన విధానానికి అమలు చేయవద్దని కోరారు. బ్రహ్మ కుమారి , అక్షయ పాత్ర సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు మానుకోవాలని సూచించారు. పేద విద్యార్థుల మీద ప్రయోగాలు చేయకండి ..ధార్మిక సంస్థల ఆలోచనలను విద్యార్థులకు బలవంతగా రుద్దొద్దని ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వం మానుకోవాలన్నారు. ఖైదీ ల తిండి కోసం రూ. 83 రూపాయలు ఖర్చు చేస్తోంది .. కానీ విద్యార్థుల తిండి కోసం రూ. 37 రూపాయలు ఖర్చు చేస్తోంది. అన్నమో రామచంద్ర అంటూ అర్దాకలితో గురుకులాల్లో విద్యార్థులు పస్తులు ఉంటున్నారు. కాబట్టి సీఎం రేవంత్ గురుకుల విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్‌ చేశారు. అలాగే గురుకులాల్లో పాము కాట్లకు గురై విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో యూనివర్సటీలకు వీసీలు లేరని.. వర్సిటీల నిర్వాహణ పై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

హైడ్రా అందరికీ ఒకే న్యాయం పాటించాలి. పర్యావరణాన్ని కాపాడుకోవాలి కానీ పేదలకు ఒక న్యాయం , ధనవంతులకు ఒక న్యాయం వుండకూడదన్నారు. పేదల పైన వెంటనే యాక్షన్ తీసుకుంటున్న హైడ్రా .. దుర్గం చెరువులో తిరుపతి రెడ్డి ఇంటికి ఎందుకు వెళ్ళలేదని ప్రశ్నించారు. మహబూబ్ నగర్ లో అంధుల కాలనీ లో అధికారులు ఇళ్ళు కూలుస్తున్నపుడు శిథిలాల్లో

యూనిఫామ్ వేసుకున్న అమ్మాయి తన బుక్స్ వెతుక్కుంటోంది ..ఈ దృశ్యం చూసి నాకు ఏడుపు వచ్చింది ముఖ్యమంత్రికి ఎలా నిద్రపడుతోంది ? అని ప్రశ్నించారు. 400 మంది పోలీసులతో అంధుల కాలనీ కూల్చారు కదా ..అంతేమంది పోలీసులు తిరుపతి రెడ్డి ఇంటికి వెళ్లి ఎందుకు కుల్చరు ?పేద ప్రజలపై ప్రతీకార పాలనలాగా రేవంత్ పాలన నడుస్తోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో తన తమ్ముడికి సంబంధించిన కంపెనీ ద్వారా మనీ లాండరింగ్ జరిగినట్లు అనుమానాలున్నాయన్నారు.

Raju

Raju

Writer
    Next Story