నల్లగొండలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు

నల్లగొండ జిల్లా వేములపల్లి వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది

Travels
X

నల్లగొండ జిల్లా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జగిత్యాల నుంచి దర్శి వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అద్దంకి–నార్కెట్‌పల్లి ప్రధాన రహదారిపై వేములపల్లి వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

గాయపడిన వారిని మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేగంగా వస్తున్న బస్సు బోల్తా కొట్టినా ప్రాణాపాయం లేకుండా స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకోని విచారణ చేపట్టారు

Vamshi

Vamshi

Writer
    Next Story