రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రులు

ఇప్పటికే విగ్రహ ఏర్పాటు పూర్తైనందున ల్యాండ్ స్కేపింగ్ ఇతర పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు

రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రులు
X

ఈ నెల 20 వ తేదీన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సచివాలయం ముందు రాజీవ్‌ విగ్రహావిష్కరణ ఉన్నది. విగ్రహం ఏర్పాటు చేస్తున్న రాజీవ్‌ గాంధీ విగ్రహ ప్రాంగణంలో పనులను మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ,ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పరిశీలించారు.

ఇప్పటికే విగ్రహ ఏర్పాటు పూర్తైనందున ల్యాండ్ స్కేపింగ్ ఇతర పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణ మ్యాప్ ను పరిశీలించి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు పలు సూచనలు చేశారు.

Raju

Raju

Writer
    Next Story