కరీంనగర్ అభివృద్ధిపై మంత్రి పొన్నం, ఎమ్మెల్యే గంగుల తో చర్చిస్తా: బండి సంజయ్
తనకు రాజకీయంగా జన్మభూమి అయిన కరీంనగర్ గడ్డ రుణం తీర్చుకుంటాను అన్నారు. ఈ నగరాన్ని అద్దంగా తీర్చిదిద్దుతానని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ తెలిపారు.
- By RajuLoading...
- | 14 July 2024 9:56 AM GMT
X
X
కరీంనగర్ నియోజకవర్గానికి నిధులు తెచ్చే బాధ్యత తనదేనని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు. కరీంనగర్ కార్పొరేటర్లు బండి సంజయ్ను సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు రాజకీయంగా జన్మభూమి అయిన కరీంనగర్ గడ్డ రుణం తీర్చుకుంటాను అన్నారు. ఈ నగరాన్ని అద్దంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.
జిల్లా అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో చర్చిస్తానని వివరించారు. స్మార్ట్ సిటీ పనుల కోసం మిగిలిన నిధులు త్వరలో మంజూరు చేయిస్తానని అన్నారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు సంజయ్ ధన్యవాదాలు తెలిపారు.
Raju
Writer
Next Story