గాంధీ ఆస్పత్రిలో హెల్త్ మినిస్టర్ ఆకస్మిక తనిఖీ

హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో మంత్రి దామోదర రాజనర్సింహ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రోగులకు అందుతున్న వైద్య సౌకర్యంపై ఆరా తీశారు.

Damodhara
X

హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో మంత్రి దామోదర రాజనర్సింహ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రోగులకు అందుతున్న వైద్య సౌకర్యంపై ఆరా తీశారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులకు సూచించారు. ఆస్పత్రిలో బెడ్‌లు, ఓపి రోజు వారి వివరాలు సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారిని అడిగి తెలుసుకున్నారు.

నర్సింగ్ సిబ్బంది, డయాగ్నస్టిక్, క్లినికల్ విభాగాలలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను మంత్రి దామోదర అడిగి తెలుసుకున్నారు. వైరల్‌ ఫీవర్స్‌తో వస్తున్న రోగులకు మెరుగైన చికిత్స అందించాలని తెలిపారు. మంత్రి ఆకస్మిక తనిఖీ సమాచారం తెలుసుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వాణి హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story