జేఎన్టీయూ ఘటనపై మంత్రి దామోదర ఫైర్

సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ జేఎన్టీయూ కాలేజ్ క్యాంటీన్లో సాంబార్ లో ఎలుక వచ్చిన ఘటనపై మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jntu
X

సంగారెడ్డి సుల్లాన్‌పూర్ జేఎన్టీయూ ఘటనపై మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజ్ క్యాంటీన్లో సాంబార్‌లో ఎలుక వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తక్షణం విచారణ చేపట్టాలని మంత్రి దామోదర్ జిల్లా అదనపు కలెక్టర్, స్థానిక ఆర్డిఓ, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. విచారణ చేపట్టి వెంటనే నివేదికను సమర్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు ఆదేశాలకు తెలిపారు.

అలాగే, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో, కళాశాలలో ఉన్న బోర్డింగ్, హాస్టలను , క్యాంటీన్లను తనిఖీలు నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆహార పదార్థాలను తయారు చేసే నిర్వాహాకులు FSSAI లైసెన్స్ ను తీసుకోవాలని మంత్రి కోరారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని సంస్థల లైసెన్సులను వెంటనే రద్దు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరం హోటల్స్, రెస్టారెంట్స్ తో పాటు బేకరీలు, బోర్డింగ్, హాస్టల్స్, క్యాంటీన్లు, ఆహార పదార్థాలు తయారు చేసే నిర్వాహకుల పై నిఘా ఉంచాలని మంత్రి అధికారాన్ని ఆదేశించారు.

Vamshi

Vamshi

Writer
    Next Story