రేపు మెగా డీఎస్సీ, టెట్ నోటిఫికేషన్
వైసీపీ ప్రభుత్వం 6,100 టీచర్ పోస్టులతో విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. 16,347 పోస్టులతో రేపు మెగా డీఎస్సీతో పాటు టెట్ ప్రకటనను విడుదల చేయనున్నది.
- By RajuLoading...
- | 30 Jun 2024 5:12 PM GMT
X
ఏపీ కొలువుదీరిన కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీతో పాటు టెట్ నిర్వహించేందుకు నిర్ణయించింది. రేపు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ను రద్దు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ 6,100 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మెగా డీఎస్సీ ఇస్తామని కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ మేరకు పాత ప్రకటనను రద్దు చేసి 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించింది.
ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించిన టెట్లో క్వాలిఫై కాని వారు, ఈ టెట్ ప్రకటన తర్వాత బీ.ఎడ్, డీ.ఎడ్ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు ఉన్నారు. వారందరికీ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మెగా డీఎస్సీతో పాటు టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
జులై 1న మెగా డీఎస్సీ, టెట్ ప్రకటనలు విడుదల చేయడానికి అధికారులు సన్నద్ధమయ్యారు. గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వాళ్లు తిరిగి ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదని, కానీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారలు చెబుతున్నారు.