ఛత్తీస్‌ఘడ్‌లో భారీ ఎన్‌కౌంటర్..8 మంది న‌క్స‌ల్ మృతి

ఈ నెల‌లో ఇది రెండో యాంటీ న‌క్స‌ల్ ఆప‌రేష‌న్

Maiosts
X

ఛత్తీస్‌ఘడ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. అబుజ్‌మాడ్ అడ‌వి ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మొత్తం 8 మంది, ఒక జవాను మృతిచెందారు. మ‌రో ఇద్ద‌రు జ‌వాన్లు గాయ‌ప‌డ్డారు. అబుజ్‌మాడ్ అడ‌వుల్లో ఇవాళ ఉద‌యం ఎన్‌కౌంట‌ర్ మొద‌లైంది. నారాయ‌ణ‌పుర్, కంకేర్, దంతేవాడ‌, కొండ‌గావ్ జిల్లాల‌కు చెందిన భ‌ద్ర‌తా ద‌ళాలు యాంటీ న‌క్స‌ల్ ఆప‌రేష‌న్ చేప‌డుతున్న స‌మ‌యంలో ఎదురుకాల్పులు జ‌రిగిన‌ట్లు రాయ్‌పూర్ సీనియ‌ర్ పోలీసు అధికారి ఒక‌రు తెలిపారు.

డిస్ట్రిక్ట్ రిజ‌ర్వ్ గార్డ్‌, స్పెష‌ల్ టాస్క్ ఫోర్స్‌, 53 బెటాలియ‌న్ ఐటీబీపీకి చెందిన ద‌ళాలు జూన్ 12న కూంబింగ్ ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టాయి. ఎన్‌కౌంట‌ర్‌కు చెందిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ నెల‌లో ఇది రెండో యాంటీ న‌క్స‌ల్ ఆప‌రేష‌న్... జూన్ 7న జ‌రిగిన మొద‌టి ఆప‌రేష‌న్‌లో ఐదుగురు నక్సలైట్లను హతమార్చిన విష‌యం తెలిసిందే.ఇక గత వారం కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అమిత్ షా, ఎన్‌డీఏ మూడో టర్మ్ లో నక్సలైట్ లేదా మావోయిస్ట్ తిరుగుబాటును పరిష్కరిస్తానని చెప్పారు.

Vamshi

Vamshi

Writer
    Next Story