శ్రీసిటీలో పలు కంపెనీల ప్రారంభం.. సంస్థలకు శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు

సీఎం చంద్రబాబు నేడు తిరుపతి జిల్లా శ్రీసిటీలో పర్యటించనున్నారు. వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

శ్రీసిటీలో పలు కంపెనీల ప్రారంభం.. సంస్థలకు శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు
X

సీఎం చంద్రబాబు నేడు తిరుపతి జిల్లా శ్రీసిటీలో పర్యటించనున్నారు. వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అక్కడ 16 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. మరో ఏడు సంస్థలకు శంకుస్థాపన చేయనున్నారు. శ్రీసిటీలో రూ. 900 కోట్ల పెట్టుబడితో 2,740 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాన్నారు. మరో రూ. 1,213 కోట్ల పెట్టుబడికి ప్రభుత్వం ఒప్పందాలు కుర్చుకోనున్నది.

టీడీపీ మొదటి నుంచి ఆడపడుచుల పక్షపాతే: చంద్రబాబు

తెలుగింటి అక్కాచెల్లెళ్లకు ఏసీ సీఎం చంద్రబాబు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ మొదటి నుంచి ఆడపడుచుల పక్షపాతే అన్నసీఎం మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించింది, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించింది టీడీపీనే అన్నారు. డ్వాక్రా సంఘాలతో మహిళా సంక్షేమానికి కృషి చేశామన్నారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, మహిళలకు అన్ని వేళలా, అన్నివిధాలుగా అండగా ఉంటామని సీఎం చంద్రబాబు తెలిపారు.

Raju

Raju

Writer
    Next Story