మూడో పతకానికి అడుగు దూరంలో మను

పారిస్‌ ఒలింపిక్స్‌లో షూటర్‌ మను బాకర్‌ హ్యాట్రిక్‌పై గురిపెట్టింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మను ఫైనల్‌కు దూసుకెళ్లింది.

మూడో పతకానికి అడుగు దూరంలో మను
X

పారిస్‌ ఒలింపిక్స్‌లో షూటర్‌ మను బాకర్‌ హ్యాట్రిక్‌పై గురిపెట్టింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మను ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో 590 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన మను తుది పోరుకు అర్హత సాధించింది.

ఈ ఒలింపిక్స్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మను బాకర్‌ ఇప్పటికే రెండు పతకాలు సాధించింది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్న మను మిక్స్‌డ్‌ విభాగంలో సరవ్‌జ్యోత్‌ తో కలిసి క్యాంసం నెగ్గిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇప్పటివరకు వచ్చిన మూడు పతకాలు షూటింగ్‌లో దక్కినవే కావడం గమనార్హం.

మను బాకర్‌ దేశానికి మరో పతాకాన్ని అందించే లక్ష్యంతో సిద్ధమైంది. ఇవాళ మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఫైనల్‌ జరగనున్నది.

Raju

Raju

Writer
    Next Story