ఎస్సీ వర్గీకరణపై మంత్రి కోమటిరెడ్డిని కలిసిన మందకృష్ణ

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కలిశారు

manda krishna
X

ఎస్సీ వర్గీకరణను త్వరలో అమలయ్యేలా విధంగా చూడాలని మంత్రి కోమటి వెంకట్‌రెడ్డిని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ఉదయం రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖామాత్యులు దామోదర రాజనర్సింహాతో పాటు మంత్రిని కలిసిన మందకృష్ణ.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని కోరారు. ఈ భేటీలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌తో పాటు, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ , కాలె యాదయ్య , మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపీ పసునూరి దయాకర్‌తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story