ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన మందకృష్ణ మాదిగ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలిశారు. హైదరాబాద్లోని ఏపీ సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
- By VamshiLoading...
- | 24 Aug 2024 2:18 PM GMT
X
X
ఏపీ సీఎం చంద్రబాబును ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలిశారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాడుతున్న మందకృష్ణను చంద్రబాబు అభినందించారు.
ఇటీవల సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వెలువడిన నేపథ్యంలో మందకృష్ణ పలువురు ముఖ్య నేతలను కలుస్తున్నారు. రెండు రోజుల క్రితం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ భేటీలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తదితరులు ఉన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ఆయన రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
Vamshi
Writer
Next Story