రుణమాఫీ దేవుడెరుగు..వడ్డీల చెల్లింపులకే రైతుల కొత్త అప్పులు

డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్న మాట తప్పి, 7 నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

రుణమాఫీ దేవుడెరుగు..వడ్డీల చెల్లింపులకే రైతుల కొత్త అప్పులు
X

డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్న మాట తప్పి, 7 నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎక్స్‌ వేదికగా ప్రభుత్వ తీరుపై విమర్శించారు. ముందుగా ఏడు నెలల వడ్డీ చెల్లించాకే, రుణ మాఫీ చేస్తామని బ్యాంకర్లు వేధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ దేవుడెరుగు, వడ్డీ చెల్లించడానికి కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందని బాధపడుతున్నారని తెలిపారు. కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించి, డిసెంబర్ నుంచి జులై వరకు వడ్డీ ని తామే భరిస్తామనీ, రైతుల నుంచి వసూలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని హరీశ్‌ డిమాండ్‌ చేశారు.




ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట్ మండలానికి చెందిన ఒక రైతు క్రాప్ లోన్ ను, రూ.9000 మిత్తి కట్టించుకున్నాకే క్లోజ్ చేశారని బ్యాంక్‌ ఇచ్చిన రశీదును మాజీ మంత్రి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలానికి చెందిన రైతులకూ ఇదే పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రైతులు తనకు పంపిన విజ్ఞప్తులను మీ పరిశీలనకు పంపుతున్నాను. పరిష్కరించాలని కోరుతున్నానని హరీశ్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు.





Raju

Raju

Writer
    Next Story