రాజకీయ హత్యలపై అసెంబ్లీలో చర్చిద్దాం రండి: పయ్యావుల
నాలుగోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు నేడు శాసనసభ వేదికగా శ్వేత పత్రం విడుదల చేయనున్నారు.
- By RajuLoading...
- | 25 July 2024 5:44 AM GMT
X
X
ఏపీలో జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపు దాడులకు వ్యతిరేకంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. దీనిపై అధికార టీడీపీ విమర్శలు చేసింది. ఇండియా కూటమితో పొత్తు కోసమే జగన్ హస్తినకు వెళ్లినట్లు ఉన్నదని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చిన జగన్ అసెంబ్లీకి రావాలని కోరారు. ఆయన చెబుతున్న రాజకీయ హత్యల వివరాలు శాసనసభలో పెట్టాలని డిమాండ్ చేశారు.
సభలో చర్చించి సమాధానాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని పయ్యావుల పేర్కొన్నారు. శాంతిభద్రతలపై ఢిల్లీ రోడ్లపై గగ్గోలు పెట్టడం దేనికని ప్రశ్నించారు. ఈ అంశంపై అసెంబ్లీకి వచ్చి చర్చించాలన్నారు. శాసనసభలో శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
Raju
Writer
Next Story