జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి రేపు భూమి స్వాధీనం
మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పంపిణీ
- By Naveen KameraLoading...
- | 7 Sept 2024 12:12 PM GMT
X
X
జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీకి ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి 38 ఎకరాల భూమి స్వాధీనం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు రవీంద్ర భారతిలో నిర్వహించనున్న కార్యక్రమంలో హౌసింగ్ సొసైటీకి భూమిని అప్పగించనున్నారు. ఇటీవల కాలంలో వివిధ కారణాలతో మరణించిన 36 మంది జర్నలిస్టుల కుటుంబాలకు మీడియా అకాడమీ ద్వారా రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నారు. కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు.
Naveen Kamera
Writer
Next Story