అప్పటిలోగా భూసేకరణ పనులు పూర్తి చేయాలి : సీఎస్

రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం సెప్టెంబరు రెండవ వారం లోగా భూసేకరణ పనులు పూర్తి చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు.

CS Shanthi kumari
X

హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు పురోగతిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష సమావేశం నిర్వహించింది. సెప్టెంబరు రెండవ వారం లోగా భూసేకరణ పనులు పూర్తి చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. భూసేకరణ పనులు వేగవంతం చేయాలని, భూ నిర్వాసితులకు త్వరగా నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ల కమిటీలను ఏర్పాటు చేసి భూముల మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను కోరారు.

కోర్టు కేసులపై చొరవ తీసుకొని త్వరగ పరిష్కారం అయ్యేలా చూడాలని సూచించారు. ఈ పనులన్నీ త్వరగా పూర్తి చేస్తే, తదనంతర పనులకు వెళ్లవచ్చునని అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని ఈ సందర్భంగా సీఎస్ కలెక్టర్లకు సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల కార్యదర్శులతోపాటు.. రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story