యశోద ఆసుపత్రిలో జిట్టాను పరామర్శించిన కేటీఆర్

బీఆర్ఎస్ నేత, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణ రెడ్డి తీవ్ర అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

యశోద ఆసుపత్రిలో జిట్టాను పరామర్శించిన కేటీఆర్
X

తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణ రెడ్డి బ్రెయిన్‌లో ఇన్ఫెక్షన్ కారణంగా గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలోని ఐసీయూ ఉన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జిట్టాను పరామర్శించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అలాగే జిట్టా ఆరోగ్య పరిస్థితులను డాక్టర్లను అడిగి తెలుసుకున్న కేటీఆర్ మెరుగైన వైద్యం అందించాలని సూచించినట్లు తెలుస్తోంది.

గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా కేటీఆర్ వెంట ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అలాగే భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఉన్నారు

Vamshi

Vamshi

Writer
    Next Story