బర్త్డే సందర్భంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు బుధవారం నందినగర్ నివాసంలో ఘనంగా జరిగాయి.
- By VamshiLoading...
- | 24 July 2024 3:07 PM GMT
X
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు బంజారాహిల్స్ నంది నగర్ నివాసంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ , తల్లి శోభమ్మలకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా.. కుమారుడు కేటీఆర్ను ప్రేమతో గుండెకు హత్తుకున్న కేసీఆర్, మిఠాయిలు తినిపించి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా ఆశీర్వదించారు. కుమారునికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు నంది నగర్ కు వచ్చిన పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి కేటీఆర్ ఫొటోలు దిగారు.
సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు తో కలిసి కేటీఆర్ తన తండ్రి, కేసీఆర్ , తల్లి శోభమ్మ పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. హైదరాబాద్ స్టేట్ హోం విద్యార్థినుల సమక్షంలో కేటీఆర్ తన బర్త్ డే వేడుకలను జరుపుకున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో స్టేట్ హోంలోని 100 మంది విద్యార్థినులకు ల్యాప్టాప్లు అందజేశారు కేటీఆర్. దీంతో విద్యార్థినులంతా సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఆత్మహత్య చేసుకున్న 13 మంది నేత కార్మికుల కుటుంబాలకు కూడా కేటీఆర్ ఆర్థిక సాయం అందజేశారు.