జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని కేసీఆర్ రిట్ పిటిషన్
తెలంగాణ విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.కమిషన్ సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని వ్యాజ్యంలో పేర్కొన్నారు.
- By RajuLoading...
- | 25 Jun 2024 8:41 AM GMT
X
తెలంగాణ విద్యుత్ కమిషన్పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని వ్యాజ్యంలో పేర్కొన్నారు.. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని కేసీఆర్ తెలిపారు. జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్మీట్లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఈ రిట్ పిటిషన్లో కేసీఆర్ విద్యుత్ కమిషన్, జస్టిస్ నర్సింహారెడ్డి, ఎనర్జీ విభాగాన్ని ప్రతివాదులుగా చేర్చారు.
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన పదేళ్ల కాలంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై విచారణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మార్చి 14న జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసిన విషయం విదితమే.కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్-1952 కింద ఏర్పాటైన ఈ కమిషన్ ఇప్పటికే విచారణను ప్రారంభించింది. తెలంగాణ విద్యుత్ సంస్థలకు చెందిన సుమారు 25 మంది అధికారులను, మాజీ అధికారులను విచారించింది. వీరితో పాటు ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలని కోరుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కూ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిషన్ చెల్లదని కేసీఆర్ ఈ నెల 15వ తేదీన జస్టిస్ నర్సింహారెడ్డికి 12 పేజీల లేఖ రాశారు.
ఎంక్వైరీ కమిషన్ బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ నర్సింహారెడ్డికి ఈ అంశాలపై విచారణ చేసే అర్హత లేదని లేఖలో పేర్కొన్నారు. విచారణ కమిషన్ బాధ్యతల నుంచి వెంటనే స్వచ్ఛందంగా వైదొలగాలని జస్టిస్ నర్సింహారెడ్డికి విజ్ఞప్తి చేశారు.