ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై జగన్‌ ఫోకస్‌

ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై వైసీపీ అధినేత ఫోకస్‌ పెట్టారు. ఈ ఎన్నికలో ఎలాగైనా గెలువాలని కసరత్తు చేస్తున్నారు.

ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై జగన్‌ ఫోకస్‌
X

విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉత్తరాంధ్రలో పొలిటికల్ హీట్‌ పెరిగింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై వైసీపీ అధినేత ఫోకస్‌ పెట్టారు. ఈ ఎన్నికలో ఎలాగైనా గెలువాలని కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీ పని అయిపోయిందని కొన్ని రోజులుగా అధికార టీడీపీ చేస్తున్న ప్రచారానికి ఈ ఉప ఎన్నికలో విజయంతో సమాధానం చెప్పాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు పార్టీ నేతలతో కీలక భేటీ నిర్వహిస్తున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈరోజు పార్టీ నేతలతో జగన్‌ సమావేశం కానున్నారు. పాయకరావు పేట, పెందూర్తి, నర్సిపట్నం నియోజకవర్గాల నేతలు హాజరుకానున్నారు.సంఖ్యాబలంగా చూస్తే ఈ సీటు గెలుచుకోచ్చని భావిస్తున్నారు. అయితే అధికార టీడీపీ కూడా అభ్యర్థిని నిలబెట్టనున్నది. టీడీపీ వ్యూహాలకు ప్రతివ్యూహాలు వైసీపీ పదును పెడుతున్నది.

జగన్‌ పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే వైసీపీ సీనియర్‌ నేత ,మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ప్రకటించిన విషయం విదితమే. బొత్స గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాన్ని, నేతలు వ్యవహరించాల్సిన తీరుపై దిశా నిర్దేశం చేయనున్నారు.

Raju

Raju

Writer
    Next Story