తెలుగు రాష్ట్రాల్లో నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో పలు జిల్లాలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవు ప్రకటించారు.

Holiday
X

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో పలు జిల్లాలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవు ప్రకటించారు. తెలంగాణలో కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఖమ్మం జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. ఇప్పటికే పలు జిల్లాల్లో చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.

ఏపీలోని గుంటూరు, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కలెక్టర్లు నేడు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అదేవిధంగా తెలంగాణలో ఆయా జిల్లాల్లో పరిస్థితుల దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంపై ఆ జిల్లా కలెక్టర్లే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం విద్యాసంస్థలను మూసివేసాయి ప్రభుత్వాలు.

Vamshi

Vamshi

Writer
    Next Story