అవయవ దానం చేస్తే.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
అవయదానం చేసిన వారికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
- By VamshiLoading...
- | 8 Aug 2024 2:51 PM GMT
X
X
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవయదానం చేసిన వారికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల్లో అవయవ దానంపై అవగాహన కల్పించి, బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను అవసరార్ధులకు అమర్చడం ద్వారా . వారికి పునర్జన్మను ఇచ్చే జీవన్దాన్ కార్యక్రమంలో భాగంగా అవయవ దాతల అంతిమ సంస్కారాలను ప్రభుత్వం నిర్వహించనుంది. ఆర్డీవో స్థాయికి తక్కువ కాని అధికారుల నేతృత్వంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు అవసరమైన నియమావళిని పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
Vamshi
Writer
Next Story