నా వద్ద ఆధారాలున్నాయి.. లీగల్గా వెళ్తా: రాజ్ తరుణ్
తనపై నటి లావణ్య చేసిన ఆరోపణలపై సినీ హీరో రాజ్ తరుణ్ స్పందించాడు. తనపై ఆమె చేసినవి కాంట్రవర్సీ మాత్రమేనని... కానీ ఎక్కడా ఆధారాలు చూపించలేదన్నారు.
- By VamshiLoading...
- | 31 July 2024 1:24 PM GMT
X
తనపై లావణ్య చేసిన ఆరోపణలపై సినీ హీరో రాజ్ తరుణ్ మరోసారి స్పందించాడు. తనపై లావణ్య చేసినవి కాంట్రవర్సీ మాత్రమేనని... కానీ ఎక్కడా ఆధారాలు చూపించలేదన్నారు. ఈ విషయంపై లీగల్గా ముందుకువెళ్తా అన్నారు. ఎఫ్ఐఆర్లో అబార్షన్ సెక్షన్ ఎందుకు లేదు? నేను తప్పించుకుని తిరగలేదు. నాకు నోటీసులు ఇచ్చారు. తానూ స్పందించానన్నారు. నా ప్రతి మాట పచ్చి నిజం. నా దగ్గర ఇంకా సాక్ష్యలున్నాయి. నేను వాటిని బయట పెట్టలేదు. నేను తప్పించుకుని తిరగలేదన్నారు. ఈ టాపిక్పై ఇక నేను మాట్లాడాలనుకోవడం లేదన్నారు. తిరగబడర సామి ప్రీ రిలీజ్లో ఈవెంట్లో స్పష్టం చేశారు..
తానూ మనిషినేనని... అనవసర ఆరోపణలతో తనకూ బాధ ఉంటుందన్నారు. వాళ్లలాగా తాను మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేనన్నారు. మన మంచితనాన్ని ఆసరాగా చేసుకొని ఇలా చేస్తే బాధ వేయదా? అన్నారు. ఆ బాధతో ఇన్నాళ్లూ బయటకు రాలేదన్నారు. తాను మామూలుగానే సెన్సిటివ్ అని... అందుకే బయటకి రాలేదన్నారు. తాను అలాగే ఇంట్లో ఉంటుంటే తన కుటుంబ సభ్యులపై కూడా ప్రభావం పడుతోందన్నారు. అందుకే ఈ రోజు మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నానని మీడియాతో అన్నారు. తాను ఎంతో ధైర్యం తెచ్చుకొని... బయటకు వచ్చానన్నారు. ఇంకా అడిగి బాధపెట్టవద్దని రాజ్ తరుణ్ కోరారు.
మాల్వీ మల్హోత్ర మాట్లాడుతు నాతోపాటు నా బ్రదర్పై ఆమె ఏవైతే ఆరోపణలు చేశారో దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులతో మాట్లాడా. జులై 24న ఆమె నాకు ఓ మెసేజ్ పంపింది. దానిని కూడా పోలీసులకు అందించా. దానిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటున్నారు. మేము ఏమీ తప్పు చేయలేదు. మా ఫ్యామికి ఆమె ఎవరో తెలియదు. ఆమెను మేము చూడలేదు కూడా. ఎందుకు ఆమె ఇలా చేస్తున్నారో తెలియదు. 2020లో నన్ను కొట్టి ఇబ్బందిపెట్టిన కొంతమంది క్రిమినల్స్తో ఆమె ఇప్పుడు కాంటాక్ట్లో ఉన్నారు. ఒక అమ్మాయిగా.. వాళ్లతో టచ్లో ఉండొద్దని ఆమెకు సలహా ఇచ్చా. నా దృష్టిలో ఆమె కూడా ఓ క్రిమినల్ అని మల్హోత్ర అన్నారు.