రాంనగర్లో హైడ్రా కూల్చివేతలు
హైదరాబాద్లోని అడిక్మెట్ డివిజన్ రాంనగర్లోని మణెమ్మ కాలనీలో నాలాపై ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.
- By RajuLoading...
- | 30 Aug 2024 4:10 AM GMT
X
X
హైదరాబాద్లోని అడిక్మెట్ డివిజన్ రాంనగర్లోని మణెమ్మ కాలనీలో నాలాపై ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. నాలాపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను సిబ్బంది కూలుస్తున్నది. ఓ యువతి ఫిర్యాదుపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు.రాంనగర్ చౌరస్తాలోని మణెమ్మ కాలనీలో నాలాపై అక్రమ నిర్మాణాలు చేపట్టారని స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పలు శాఖల అధికారులతో కలిసి అక్కడ పర్యటించి పరిశీలించారు.
మణెమ్మ గల్లీలో రోడ్డు ఇరుకుగా మారిందని నాలాలను, రోడ్డును ఆక్రమించారని స్థానికులు తెలిపారు. అక్కడికి వచ్చి రెండు రోజుల కిందట మణెమ్మ కాలనీలో అక్రమాలను పరిశీలించారు.పరిశీలించిన అనంతరం 48 గంటల్లో ఆక్రమణలు కూల్చివేస్తామన్నారు. నిర్మాణాలు అక్రమమే అని నిర్ధారించిన అనంతరం హైడ్రా అధికారులు ఉదయం కూల్చివేతలు చేపట్టారు.
Raju
Writer
Next Story