రూ.6800 కోట్లతో మొత్తం మాఫీ ఎలా సాధ్యం?: సింగిరెడ్డి

నేటి నుంచి ప్రారంభించనున్న రుణమాఫీ కార్యక్రమంపై ప్రభుత్వం జమ చేయనున్న నిధులతో మాఫీ సాధ్యమో చెప్పాలని మాజీ వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు.

రూ.6800 కోట్లతో మొత్తం మాఫీ ఎలా సాధ్యం?: సింగిరెడ్డి
X

కేసీఆర్ హయాంలో మొదటి విడత రుణమాఫీ రూ.లక్ష చొప్పున 36 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమచేశాం. అప్పుడు రూ.17,000 వేల కోట్లు అయ్యాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.లక్ష లోపు రుణాలున్న రైతులు 11.5 లక్షల మంది రైతులు మాత్రమే ఎలా ఉంటారు ? రూ.6800 కోట్లు ఇస్తే మొత్తం ఎలా మాఫీ అవుతాయి ? అని మాజీ మంత్రి వ్యవసాయ శాఖ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.

అసలు లక్ష వరకు రుణం తీసుకున్న రైతులు ఎంత మంది ? రూ.2 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులు ఎంత మంది? రూ.2 లక్షల రుణం మాఫీ చేయడానికి ఎంత అవుతుంది ? అన్నది ఇప్పటిరకు స్పష్టత లేదని, దీనిపై ప్రభుత్వం వివరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Raju

Raju

Writer
    Next Story