వీధి కుక్కల నియంత్రణకు కమిటీ వేయండి హైకోర్టు ఆదేశం
వీధికుక్కల నియంత్రణపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నది. కుక్కల నియంత్రణకు వారంలోగా నిపుణుల కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశించింది.
- By VamshiLoading...
- | 10 July 2024 3:07 PM GMT
X
X
హైదరాబాద్లో వీధికుక్కల నియంత్రణపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కుక్కల నియంత్రణకు వారంలోగా నిపుణుల కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశించింది. వీధి కుక్కల దాడిలో ఇటీవల బాలుడి మృతిపై దాఖలైన పిల్పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ విషయంలో గతంలోనూ హైకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా మరణాలకు కారణమవుతున్న వీధికుక్కల నియంత్రణకు ఏం చర్యలు తీసుకున్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
తీసుకున్న చర్యలకు సంబంధించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. వీధికుక్కల నియంత్రణకు సరైన చర్యలు తీసుకోవడం లేదని.. వ్యాక్సినేషన్ చేయడం లేదని.. సరైన ఆహారం లేకపోవడంతో జనాలపై దాడులు చేస్తున్నాయని ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంలో ఉదాసీనంగా వ్యవహరించకూడదని సూచించింది. లెక్కలు కాకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా వేసింది.
Vamshi
Writer
Next Story