బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణా రెడ్డిని పరామర్శించిన హరీశ్ రావు
బీఆర్ఎస్ నేత, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణా రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో జిట్టా గత నెల రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు.
- By VamshiLoading...
- | 25 Aug 2024 8:18 AM GMT
X
బీఆర్ఎస్ నేత, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణా రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో జిట్టా గత నెల రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఆయనకు అందిస్తున్న వైద్యం వివరాలను డాక్టర్లను మాజీ మంత్రి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. అదే విధంగా జిట్టా బాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతోను హరీశ్ రావు మాట్లాడారు.
ధైర్యంగా ఉండాలని, జిట్టా కోలుకుంటున్నారని డాక్టర్లు చెప్పారని వారికి భరోసా ఇచ్చారు. జిట్టా బాలకృష్ణారెడ్డి బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. వైద్యులు ప్రస్తుతం ఐసీయూలో ఉంచి ఫ్లూయిడ్స్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. అటు శనివారం రోజున యశోదా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డిని పరామర్శించారు కేటీఆర్.