యాదాద్రిలో పాప పరిహార పూజలు చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు

ఆగస్టు15 లోగా రైతులందరికి రుణ మాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి యాదాద్రి స్వామి మీద ఒట్టేసి రైతులను దగా చేశారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.

T. Harish rao
X

ఆగస్టు15 లోగా రైతులందరికి రుణ మాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి యాదాద్రి స్వామి మీద ఒట్టేసి రైతులను దగా చేశారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ ప్రజలకు ఎలాంటి కీడు జరగొద్దని కోరుతూ ఆలయాల పర్యటన మొదలు పెట్టారు. తాజగా యాదాద్రి లోని తూర్పు రాజ గోపురం వద్ద పాప పరిహార పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చేసిన పాపం తెలంగాణ ప్రజలకు శాపం కాకుండా చూసి రక్షించాలని లక్ష్మీ నరసింహ స్వామికి పూజలు చేశారు.

ఇందులో భాగంగానే ఈరోజు నుంచి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఆలయాల యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు ధర్నాలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. అన్ని మండల కేంద్రాల్లో ఇవాళ గులాబీ పార్టీ నేతలు ధర్నాలు చేపట్టనున్నారు. ఎలాంటి షరతులు లేకుండా రూ.2లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేయనున్నారు. చేవెళ్లలో మాజీ మంత్రి కేటీఆర్, ఆలేరు రైతు ధర్నాలో హరీష్ రావు పాల్గొననున్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story