గ్రూప్-2 పరీక్ష డిసెంబర్కు వాయిదా
తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష డిసెంబర్కు వాయిదా పడ్డాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు పరీక్షలను టీజీపీఎస్సీ వాయిదా వేసింది.
- By RajuLoading...
- | 19 July 2024 2:19 PM GMT
X
X
తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష డిసెంబర్కు వాయిదా పడ్డాయి. ఆగస్టు 7,8 తేదీలలో జరగాల్సిన పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం వాయిదా వేసింది.వరుసగా పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ప్రిపరేషన్ కావడానికి సమయం లేదని కొన్నిరోజులుగా నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. వారి నిరసనలకు తలొగ్గిన ప్రభుత్వం వాయిదా వేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు పరీక్షలను టీజీపీఎస్సీ వాయిదా వేసింది. వాయిదా పడిన పరీక్షలు డిసెంబర్లో నిర్వహిస్తామని, త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని వెల్లడించింది.
Raju
Writer
Next Story